BREAKING : ఏపీలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురి మృతి

-

ఏపీలోని ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ లో బుధవారంఅర్ధ రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. యూనిట్‌ 4 లో గ్యాస్‌ లీకై మంటలు చెలరేగి రియాక్టర్‌ పేలిపోయింది. మంటలధాటికి ఆరుగురు మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. బాధితులను మొదట నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో… పరిశ్రమలో ఏకంగా 50 మంది ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటన వివరాలు తెలియడంతో.. స్థానిక ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news