సీసీటీవీలో రికార్డయిన లైవ్‌ మర్డర్‌.. పోలీసే నిందితుడు..!

-

live murder recorded in CCTV footage in bengaluru

బెంగళూరు సిటీలో లైవ్‌ మర్డర్‌ సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. కొన్ని రోజుల కింద జరిగిన ఈ మర్డర్‌కు సంబంధించిన ఫుటేజ్‌ పోలీసులకు ఇప్పుడు లభించడంతో ఆ మర్డర్‌కు సంబంధించిన కేసును ఛేదించారు పోలీసులు. నీలసంద్రకు సమీపంలోని రోజ్‌ గార్డెన్‌ సమీపంలో 36 ఏళ్ల అరుణ రాజ్‌ను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో ఉన్న అరుణ్‌ను వెంబడించిన ఓ వ్యక్తి.. ఎవరూ లేని సమయం చూసి తనతో పాటు తెచ్చుకున్న కత్తితో కసితో దాడి చేశాడు. దాదాపు 16 సార్లు అరుణ్‌ను కత్తితో పొడిచాడు.


(Video Courtesy: News 18 kannada)
ఆ సమయంలో ఇద్దరి మధ్యా తీవ్రంగా పెనుగులాట జరిగింది. అయినప్పటికీ అరుణ్‌ను ఆ వ్యక్తి వదల్లేదు. ఇంకా కసిక పొడిచాడు. తీవ్రంగా గాయపరిచిన అనంతరం అక్కడి నుంచి ఉడాయించాడు ఆ వ్యక్తి. తీవ్ర రక్తం స్రావం అవుతుండటంతో అరుణ్‌ రాజు కొంత దూరం నడిచి కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడే తుది శ్వాస విడిచాడు. తాజాగా వీడియోలో అరుణ్‌ను పొడిచిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు.. అశోక్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో పని చేస్తున్న పోలీస్‌. అతడిని అదుపులోకి తీసుకొని అరుణ్‌ను చంపడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news