పెళ్లైన 20 రోజులకే ఘోరం.. ఆ హోటల్‌లో ఏం జరిగింది?

-

హైదరాబాద్: లెమన్ ట్రీ హోటల్‌లో గురువారం రాత్రి కలకలం రేగింది. ఇద్దరు మృతదేహాలు గదిలో పడి ఉన్నాయి. హోటల్ సిబ్బంది డోర్ కొట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సంతోషి, రాములు బుధవారం మధ్యాహ్నం హోటల్‌లో దిగారు. వీరికి 20 రోజుల క్రితమే పెళ్లైంది. పెద్దలను కాదని వివాహం చేసుకున్నారు. సంతోషంగా జీవించేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చారు. రాములు జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. సంతోషి పోలీస్ జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరి క్వాలిఫికేషన్లు బాగానే ఉన్నాయి. ఇద్దరి మధ్య ఎందుకో విభేదాలు వచ్చాయి. అంతే సంతోషిని చంపి రాములు కూడా చనిపోయారు. బ్లేడ్‌తో సంతోషి గొంతు కోసి ఆమె చున్నీతోనే తానూ ఆత్మహత్య చేసుకున్నాడు రాములు.

మృతురాలిది వికారాబాద్ జిల్లా, మృతుడిది నారాయణపేట జిల్లా. ఇద్దరూ పదో తరగతి వరకూ చదువుకున్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వీరి కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు నిరాకరించారు. అయినా సరే కలిసి జీవించాలనుకున్నారు. హైదరాబాద్ వచ్చారు. వచ్చిన రెండు రోజుల్లో హోటల్‌లో చనిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news