మూఢనమ్మకానికి గర్భిణీ బలి.. కట్టుకున్న భర్తే కడతేర్చాడు..!

-

తమిళనాడులోని పుదుచ్చేరిలో దారుణం చోటు చేసుకున్నది. సొంత భార్యనే కడతేర్చాడు ఓ భర్త. కోటీశ్వరుడు కావాలనే ఆశతో ఓ స్వామీజీ మాటలను నమ్మి.. గర్భంతో ఉన్న భార్యను చంపేశాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.

గర్భిణీని బలి ఇస్తే కోటీశ్వరుడు కావచ్చని ఆ వ్యక్తికి స్వామీజీ సలహా ఇస్తాడు. దీంతో ఎలాగైనా కోటీశ్వరుడు కావాలన్న ఆశతో గర్భిణీగా ఉన్న సొంత భార్యనే గొంతు కోసి చంపాడు ఆ ప్రబుద్ధుడు. అనంతరం భార్య శవాన్ని తీసుకెళ్లి పొదల్లో పడేసి వెళ్లి పోలీసులకు తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఫోలీసులు ఆ మహిళ కోసం వెతుకుతుండగా.. ఊరి బయట పొదల్లో ఆమె శవం కనిపించింది.

అనుమానాస్పద స్థితిలో ఆ గర్భిణీ మరణించి ఉండటంతో తనను ఎవరో చంపి అక్కడ పడేశారని పోలీసులు భావించారు. దీంతో తమకు అనుమానం ఉన్న వ్యక్తుల మీద నిఘా పెట్టారు. ఆ మహిళ భర్త మీద కూడా పోలీసులు నిఘా పెట్టడం, అతడి కదలికలపై అనుమానం రావడంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా… తానే ఈ నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. కోటీశ్వరుడు కావాలన్న ఆశతోనే స్వామీజీ చెప్పిన మాటలు విని తన భార్యను బలి ఇచ్చినట్టు ఒప్పుకున్నాడు. ఇక.. ఈ హత్యలో పాలు పంచుకున్న మరో ఐదుగురు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మాయల మాత్రికుడి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news