రాజగోపాల్ రెడ్డి కి మరోసారి షోకాజ్ నోటీసులు

-

ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  టీపీసీసీ మరోసారి షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. సోమవారం సమావేశమైన క్రమశిక్షణ కమిటీ గతంలో రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన  వివరణ సరిగా లేదని పేర్కొంది. మునుగోడులో ఆయన మాట్లాడిన మాటలకీ, వివరణ ఇచ్చిన తీరుకి ఎలాంటి సంబంధం లేదని వారు పేర్కొన్నారు.

క్రమశిక్షణకు సంబంధించి ఎక్కడా కూడా కోమటి రెడ్డి వివరణ ఇవ్వలేదని వారు పేర్కొన్నారు.  విలేకరుల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు నోటీసులు ఇచ్చే స్థాయి కమిటీకి లేదనటాన్ని కోదండరెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ  తీవ్రంగా తప్పుబట్టింది. దీంతో మరోసారి షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని  కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news