డబ్బు కోసం భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి.. క్షుద్రపూజలు

-

డబ్బు కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారు. కన్నబిడ్డలను కిరాతకంగా చంపేయగలరు.. కన్నతల్లిదండ్రులను కర్కశంగా హతమార్చగలరు.. భర్తను పైలోకానికి పంపించగలరు.. ఇలా డబ్బు కోసం ఎవరైనా ఎంతకైనా తెగిస్తారు. అయితే మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి డబ్బు కోసం క్షుద్రపూజలు చేశాడు. కేవలం క్షుద్రపూజలే అయితే ఇప్పుడు మనం ఆ విషయం గురించి మాట్లాడుకునే వాళ్లం కాదు. డబ్బు కోసం కట్టుకున్న భార్యను అందరిముందు నగ్నంగా నిలబెట్టాడు ఓ ప్రబుద్ధుడు.

వ్యాపారంలో లాభాలు చేరుకుని ఇంట సుఖశాంతులు నెలకొనాలంటే అఘోరీ పూజ చేయాలని ఎవరో చెప్పారని ఈ దుర్మాగానికి ఒడిగట్టాడు ఆ వ్యక్తి. దీనికి అతని తల్లిదండ్రులు సైతం సహకరించారు. దీంతో అతని ఆగడాలు మితిమీరిపోయాయి. ఏకంగా భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయాలని బలవంతం చేశాడు. భర్త ఒత్తిడికి తలొగ్గిన నిస్సహాయురాలైన భార్య.. చెప్పినట్టు ఆ పని చేసింది. చుట్టూ ఉన్నవారు సైతం దీన్ని చూస్తూ నివ్వెరపోయారే తప్ప ఎవరూ ఆ భర్తను ప్రశ్నించే ధైర్యం చేయలేదు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో భాగస్వాములైన అతని తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. కాగా ఈ ఉదంతానికి సహకరించిన మాంత్రికుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news