బాలికపై అత్యాచారం చేసి జైలుకు.. బెయిల్‌పై బయటకొచ్చి మళ్లీ..

-

మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బాలికపై అత్యాచారం చేసిన యువకుడు బాధితురాలి ఫిర్యాదుతో జైలుకు వెళ్లాడు. ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు పగ తీర్చుకోవాలని వేచిచూశాడు. ఏడాది తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మళ్లీ ఆ బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ వివేక్​ లాల్​ తెలిపారు. శనివారం రోజున నిందిడుని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలోని ఖాత్​ఖరీ ప్రాంతానికి చెందిన.. 26 ఏళ్ల నిందితుడు గత సంవత్సరం బాలికపై అత్యాచారం చేసినందుకు సెప్టెంబర్​ 23న అరెస్ట్ అయ్యాడు. నిందితుడు కొద్దిరోజుల క్రితం బెయిల్​పై బయటకు వచ్చి మళ్లీ అదే బాలికపై అత్యాచారం చేశాడు. గత శుక్రవారం ఇంటి పనిమీద బయటకు వెళ్లిన బాలికను నిందితుడు అపహరించి.. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకుపోయి బెదిరించి మరీ అత్యాచారం జరిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news