50 వేల కోసం మారుతీ రావు…

-

మారుతీ రావు ఆత్మహత్య వెనుక ఇప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొంత కాలంగా మారుతిరావు దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. తమకు ఇష్టం లేని కూతురు అమృత ప్రేమ వివాహం, ప్రణయ్‌ హత్య వీరిని మానసికంగా కృంగికృశించేలా చేశాయి. దీనికోసం మారుతిరావు హైదరాబాద్‌లో చికిత్స కూడా తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్తితి ఇలా ఉంటే దానికి తోడు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నట్లు ఆయన మిత్రులు తెలిపారు.

మారుతీరావు కు సంబంధించిన కొన్ని ఆస్తుల కు సంబంధించి ఆయన తమ్ముడికి కూడా వాటాలు ఉన్నాయి. ఈ మధ్య మిర్యాలగూడ పట్టణ సమీపంలోని ఈదులగూడెంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ విక్రయించగా, తన తమ్ముడికి వాటా ఉండటంతో, సంబంధిత నగదు తమ్ముడికే చేరడం, బ్యాంకు నుంచి నోటీసులు అందడం వంటి ఆర్థిక ఇబ్బందులు మారుతీరావు ను మరింత కృంగదీసాయి. డబ్బులు లేకపోవడం మారుతిరావుకు ప్రధాన ఇబ్బందిగా మారింది. ఆయన పేరుమీదున్న ఆస్తులు అమ్మేందుకు సిద్ధ పడిన కొనేందుకు ఎవరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు.

ఎన్ని ఆస్తులు ఉన్న 50 వేలకోసం ఆయన పడే ఇబ్బందుల గురించి తన మిత్రులతో చాలా సార్లు బాధ వ్యక్తం చేసుకున్నారు. మరోవైపు ప్రణయ్‌ హత్య కేసు విచారణకు రావడంతో, కేసు సంబంధించి పలు మార్లు హైదరాబాద్‌కు తిరగడం, వీటన్నింటికీ తోడు ఖర్చుల కోసం చేతిలో డబ్బులు లేకపోవడం మారుతిరావుకు మనశ్శాంతి లేకుండా అయింది.

ఈ పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వడంతో డాక్టర్ ను సంప్రదించగా, ఆయన అందుబాటులో లేని కారణంగా, మందులు కూడా మానేశారు. ఇవన్నీ కూడా మారుతీరావు ను ఆత్మహత్యకు ప్రేరేపించాయి అని ఆయన మిత్రులు తెలిపారు. మారుతిరావు అంత్యక్రియలు మిర్యాలగూడలో సోమవారం జరగనున్నాయి. అయితే ఆయన అంత్యక్రియలను భార్య గిరిజ నిర్వహిస్తారు అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news