క‌న్న త‌ల్లి కాదు క‌సాయి త‌ల్లి.. ఐదేళ్ల కుమారుడికి యాసిడ్ తాగించి..

-

కన్నబిడ్డకు చిన్న దెబ్బ తగిలినా తల్లిడిల్లిపోయే తల్లి ఘాతుకానికి పాల్పడింది. కన్నతల్లే చిన్నారి పాలిట మృత్యు దేవతగా మారింది. నవ మాసాలు మోసి కన్నబిడ్డను కడతేర్చింది. బిడ్డకు పాలు పట్టించాల్సిన చేతులతో యాసిడ్ ప‌ట్టించింది. వివ‌నాల‌క‌ల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లాలోమరో కసాయి తల్లి దుశ్చర్య బయటపడింది. ఐదేళ్ల కొడుకుకు విషమిచ్చి చంపిన కసాయి తల్లి.

చింతపల్లి మండలం వర్కాలలో ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల కుమారుడు జశ్వంత్‌రెడ్డికి తల్లి శివరాణి యాసిడ్‌ తాగించింది. దీంతో జశ్వంత్‌రెడ్డి మృతి చెందాడు. బాలుడి హత్యకు కుటుంబ కలహాలే కారణమని బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news