బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ చోరీ కేసును చేధించిన పోలీసులు

-

సెప్టెంబర్ 21న హైదరాబాద్ ఈసీఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లో 432 మొబైల్ ఫోన్లు చోరీ చేసిన కేసును కుషాయిగూడ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. మొత్తం రూ.70లక్షల విలువైన 432 మొబైల్‌ ఫోన్లను దుండగులు చోరీ చేసినట్లు ఘటన తర్వాత బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ స్టోర్‌ మేనేజర్‌ పోలీసుల ఫిర్యాదు చేశారు. వీటిలో ఐఫోన్‌, ఒప్పో, వన్‌ప్లస్‌, వివో బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు పేర్కొన్నారు.

ఈ కేసుపై వివిధ కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు ఝార్ఖండ్‌కు చెందిన షేక్‌ సత్తార్‌, అసీదుల్‌ షేక్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా కేసును పోలీసులు ఛేదించినట్లు తెలుస్తోంది. చోరీ చేసిన స్మార్ట్‌ఫోన్లను నిందితులు బంగ్లాదేశ్‌కు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

బంగ్లాదేశ్‌ సరిహద్దుకు 3 కి.మీ దూరంలో నివసించే ముఠా ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకులు, మొబైల్‌ షాపులు, జ్యూవెలరీ షాపుల్లో చోరీ చేయడంలో ఈ ముఠా ఆరితేరినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడు షేక్‌ సత్తార్‌, అసీదుల్‌ షేక్‌ నుంచి రెండు మొబైల్‌ఫోన్లు, రూ.80వేల నగదు మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news