గ‌చ్చిబౌలి లో దారుణం : తండ్రి పై కిరోసిన్ పోసి నిప్పంటించిన కొడుకు

-

హైద‌రాబాద్ ప‌ట్ట‌ణంలోని గ‌చ్చిబౌలి లో దారుణం చోటు చేసుకుంది. క‌న్న తండ్రి పాలిట కొడుకే కాల య‌ముడు అయ్యాడు. కసాయి కొడుకు తండ్రి పై కిరోసిన్ పోసి నిప్పంటించి హ‌త్య చేశాడు. ఈ ఘ‌ట‌న కాస్త ఆల‌స్యం గా వెలుగు లోకి వ‌చ్చింది. పోలీసుల వివ‌రాల ప్ర‌కారం దుర్గ‌రావు అనే వ్య‌క్తి హైద‌రాబాద్ న‌గ‌రం లో ని గ‌చ్చిబౌలి లో నివాసం ఉంటున్నాడు. ఈ మ‌ధ్య కాలంలో దుర్గ రావు అత‌ని కుమారుడు మ‌ధ్య వివాదాలు జ‌రుగుత‌న్నాయ‌ని తెలిసింది.

దీంతో మంగ‌ళ వారం రాత్రి కుమారుడు తండ్రి దుర్గ రావు పై కిరోస‌న్ పోసి నిప్పు అంటించాడు. త‌ర్వాత కుమారుడు ఘ‌ట‌న స్థలం నుంచి పారిపోయాడు. దీంతో స్థానికులు దుర్గ రావును ఉస్మానియా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి కి త‌ర‌లించారు. అయితే దుర్గ రావు చికిత్స పొందుతూ బుధ వారం మృతి చెందాడు. అయితే గ‌చ్చి బౌలి పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. అలాగే ద‌ర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఈ కేసు గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news