నీళ్లలో సరదా ఆట ముగ్గురి ప్రాణాలు తీసింది.. వైరల్ వీడియో

-

జనగామ జిల్లాలోని నర్మెట మండలంలో ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటికి రావడంతో… ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

సాధారణంగా నీళ్లను చూస్తే ఎవ్వరికైనా కాళ్లు ఆగవు. నీళ్లతో ఆడుకోవాలనిపిస్తుంది. సరదాగా నీళ్లలో గడపాలనిపిస్తుంది. వీళ్లు కూడా అదే పని చేశారు. ఏదో కాసేపు నీళ్లతో ఆడుకుందామనుకున్నారు. సరదాగా కొంచెంసేపు నీళ్లలో గడుపుదామనుకున్నారు. కానీ.. ఏమైందో ఏమో కానీ.. సరదా కాస్త విషాదంగా మారింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాళ్లు అదే నీళ్లలో మునిగి మృతిచెందడం సర్వత్రా సంచలనం సృష్టించింది.

జనగామ జిల్లాలోని నర్మెట మండలంలో ఉన్న బొమ్మకూరు రిజర్వాయర్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో కూడా బయటికి రావడంతో… ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

అవినాశ్ అనే యువకుడు.. తన భార్య, ఇద్దరు మరదళ్లతో కలిసి బొమ్మకూర్ రిజర్వాయర్ కు వెళ్లాడు. అక్కడ వీరంతా కాసేపు సరదాగా గడిపారు. కొంతసేపటి తర్వాత.. అవినాశ్, అతడి ఇద్దరు మరదళ్లు రిజర్వాయర్ లోకి దిగారు. అవినాశ్ భార్య వాళ్లు సరదాగా ఆడుకుంటుండగా వీడియో తీస్తోంది. వాళ్లు నీళ్లతో కాసేపు ఆడుకున్నారు. అవినాశ్ వాళ్ల భుజాల మీద చేతులేసి వాళ్లను వెనక్కి లాగాడు. అంతే.. వెనుక ఉన్న లోతైన గుంతలో పడిపోయి… ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

వాళ్లు రిజర్వాయర్ లో మునిగిపోయేంతవరకు వీడియో తీసిన అవినాశ్ భార్య.. ఆ తర్వాత బావ.. బావ అంటూ అరిచింది. వాళ్లు మునిగిపోవడం చూసి భయపడి వెంటనే అక్కడి వారికి తెలపడంతో.. అక్కడి స్థానికులు ఈతగాళ్ల సాయంతో రిజర్వాయర్ లో వెతికించారు. కానీ.. అప్పటికే వాళ్లు మృతి చెందారు.
ఇప్పటిదాకా సరదాగా గడిపిన వాళ్లు.. ఇంతలోనే విగతజీవులుగా మారారని.. అవినాశ్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news