తెలంగాణలో దారుణం..ట్రాన్స్ జెండర్ పై లైంగిక దాడి, ఆ తర్వాత హత్య !

-

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ (మం) మరేపల్లీ లో ట్రాన్స్ జెండర్ అయిన దీపిక పై స్నేహితుడు సాయి హర్ష దాడి చేశాడు. అంతేకాదు, ఆ ట్రాన్స్ జెండర్ అయిన దీపిక పై లైంగిక దాడి చేసిన అనంతరం… దాడి చేసినట్లు సమాచారం అందుతోంది.

దీంతో తీవ్ర గాయాలతో హైదరాబాద్ చందానగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందింది దీపిక. అయితే.. తాజాగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది ట్రాన్స్ జెండర్ దీపిక. అనంతరం దీపిక మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి..హత్య అని తేల్చారు వైద్యులు.

గురువారం రోజు బోనాల పండుగ కోసం వచ్చిన అంబర్ పేట కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపిక.. ఈ నేపథ్యంలో సాయిహర్ష దాడికి గురైంది. ఈ కేసును DSP రవీందర్ రెడ్డి నేతృత్వంలో లో విచారణ చేస్తున్నారు. ఎల్ బీ నగర్ కు చెందిన సాయి హర్ష దీపిక ను హత్య చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ కు వచ్చిన పోలీసులు..నిందితుడు సాయి హర్ష కోసం గాలిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news