పోలీసులకు చిక్కిన ప్రియాంక రెడ్డి హత్యకేసు నిందితులు..?

-

హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనే ఓ మహిళా వెటర్నరీ డాక్టర్ దారుణమైన రీతిలో హత్యకు గురైంది. షాద్ నగర్ సమీపంలో ఆమె మృతదేహం దహనమైన స్థితిలో కనిపించింది. హాస్పిటల్ కు వెళ్లిన ఆమె తిరిగి వచ్చే సమయంలో స్కూటీ పాడవడంతో రోడ్డుపై నిలిచిపోయింది. ఆ సమయంలో తన చుట్టుపక్కల కొందరు లారీ డ్రైవర్లు ఉన్నారంటూ తన చెల్లికి చేసిన ఫోన్ కాలే ఆమె చివరి మాటలు! ఆ తర్వాత రోజు ఉదయం ఆమె శవమై కనిపించింది. అయితే ప్రియాంక హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

వీరిని అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్లుగా గుర్తించినట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని జేపీ దర్గా వద్ద నంబరు ప్లేటు లేని ప్రియాంక స్కూటీని గుర్తించారు. నిందితులు కావాలనే నంబరు ప్లేటును తొలగించి స్కూటీని అక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. అలాగే, స్కూటీ కనిపించిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లారీ నంబరు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news