కలికాలం అయ్యా: భర్త హత్య లైవ్ లో చూసి ఎంజాయ్ చేసిన భార్య …

-

ఈ మధ్యన తెలంగాణాలో కూకట్ పల్లి లో జరిగిన జిమ్ ట్రైనర్ జయకృష్ణ హత్య గురించి తెలిసిందే. ఈ హత్యలో ఒళ్ళు గగుర్పొడిచే విషయాలను పోలీసులు ఛేదించి బయటపెట్టారు. ఫైనల్ గా ఈ హత్యను చేయించింది జయకృష్ణ భార్య దుర్గ. ఈ విషయం తెలిసిన చుట్టూ పక్కల వారు మరియు ఈ వార్తను చదివిన ఇతర ప్రాంతాల వారు షాక్ అయ్యారు. కాగా భార్య దుర్గకు చిన్న అనే యువకుడితో అక్రమసంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్తగా జయకృష్ణ ఆగ్రహం తెచ్చుకుని ఎలాగైనా దీని నుండి బయటపడాలనుకున్నాడు. అందులో భాగంగా ఊరికి వెళదామని దుర్గకు చెప్పాడు. అయితే ఆమె దీనికి ఒప్పుకోక పోగా ఆలస్యం చేస్తే ఎక్కడ కొంపమునుగుతుందో అని భావించి తనని చంపడానికి ప్లాన్ చేసింది.

ప్లాన్ లో భాగంగా మొదటగా దుర్గ ఊరికి వెళ్ళగానే… యువకుడు చిన్న జయకృష్ణకు ఫుల్ గా మద్యం తాగించి చంపేశాడు, చంపిన తర్వాత సజీవదహనం చేశాడు. కాగా ఈ తతంగం అంతా లైవ్ లో చూసి రాక్షసానందాన్ని పొందింది.

Read more RELATED
Recommended to you

Latest news