మహిళ ప్రాణం తీసిన ఫోన్ ఫోటోలు.. !

-

ఫోన్ లో ఉన్న ఫోటోలు ఓ మహిళను పొట్టన పెట్టుకున్నాయి.. అంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మం అంటారా? కానీ నమ్మాల్సిందే.. పదండి ఓ సారి ఉత్తర్ ప్రదేశ్ వెళ్లి వద్దాం.

యూపీలోని మీరట్ కు చెందిన శుభం కుమార్ తన ఫోన్ ను మరో వ్యక్తికి అమ్మేశాడు. అయితే తన ఫోన్ ను అమ్మేటప్పుడు ఆ ఫోన్ లో ఉన్న ఫోటోలను డిలీట్ చేయడం మరిచిపోయాడు. ఫోన్ కొన్న వ్యక్తి ఆ ఫోన్ ను చెక్ చేస్తే అందులో శుభం ఓ యువతితో కలిసి దిగిన ఫోటోలు అందులో కనిపించాయి.

ఆ ఫోటోలు కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆ యువతి శుభం గర్ల్ ఫ్రెండ్. వాళ్లిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫోటోలు అవి. దీంతో ఆ ఫోటోలను డిలీట్ చేయకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ ఫోన్ ను కొన్న వ్యక్తి.

అయితే శుభం గర్ల్ ఫ్రెండ్ కి వేరే వ్యక్తితో పెళ్లి అయిపోయింది. తనకు ఇప్పుడు ఒక బాబు కూడా. ఈ నేపథ్యలో వైరల్ అయిన ఫోటోలు ఆర్ మహిళ కంటబడ్డాయి. దీంతో తన మాజీ బాయ్ ఫ్రెండ్ ని నిలదీసింది. ఆ ఫోన్ అమ్మేసానని తనకేమీ తెలియదని శుభం చెప్పాడు. ఫోన్ కొన్న వ్యక్తే ఫోటోలను వైరల్ చేసిర్ ఉంటాడని భావించి ఆ వ్యక్తిని శుభం, అతడి ఫ్రెండ్స్ ఇటీవలే చంపేశారు.

అయితే అతడి హత్య తన మీదికి ఎక్కడ వస్తుందోనని, తన ఫోటోలు నలుగురు చూస్తే ఏమనుకుంటారో అని ఆ మహిళ తన కొడుకుతో సహా ముఝఫర్ నగర్ లోని గంగ్ నాహర్ కాల్వలోకి దూకింది. దీంతో ఆమె మరణించగా తన కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. చూశారా… ఫోన్ లోని ఫోటోలు ఎంత పని చేశాయో.?

Read more RELATED
Recommended to you

Latest news