బంజారాహిల్స్ దారుణం… మహిళను హింసిస్తూ అత్యాచారం

-

మహిళలు, యువతులు కామాంధులు దాష్టీకాలకు బలవుతున్నారు. మంచితనం నటిస్తూనే మహిళలను చెరబుతున్నారు. ఇటీవల కాలంలో దేశంలో ఎక్కడోచోట మహిళలు అత్యాచారాలకు గురువుతూనే ఉన్నారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావీవరసలు మరిచి సొంత కూతుళ్లపైనే అత్యాచార ఘటనకు పాల్పడుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..దిశ, పోక్సో, నిర్భయ వంటి చట్టాలు తీసుకువస్తున్నా ఆడవాళ్లపై హింస, అత్యాచారాలు ఆగడం లేదు. 

తాజాగా బంజారాహిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. బెల్ట్ తో కొట్టి దారుణంగా హింసించి మహిళ(32)పై అత్యాచారాని పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన రోడ్ నం. 12 ఫస్ట్ లాన్సర్ లో నివసించే మహిళకు 2010లో ఖాదర్ అనే వ్యక్తితో వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2020లో భర్తతో విడిపోయి పిల్లలతో ఉంటూ హౌజ్ కీపింగ్ పనులు చేసుకుంటూ ఉంటోంది. ఇదే సమయంలో టోలిచౌకీ వాసి రషీద్ తో పరచయం ఏర్పడగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోగా… కోపంతో రషీద్ ఆమెను రేప్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news