ప్రియుడి ఎదుటే యువతిపై గ్యాంగ్ రేప్..

-

ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా… ఎన్ని కఠిన శిక్షలు విధించినా… మహిళలపై జరిగే అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో ఏదో ఒక మూల ప్రతి క్షణం, ప్రతి నిమిషం.. మహిళలపై ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని మైసూర్ లో దారుణమైన ఘటన చోటు చేసుకున్నది.

ప్రియుడి ఎదుటే ఓ యువతిపై నలుగురు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. మైసూర్ జిల్లాలోని హెచ్డీ కోటే హ్యాండ్ పోస్ట్ ప్రాంతానికి చెందిన శివసిద్ధు, అతడి ప్రేయసి రాత్రి 10.30 సమయంలో మైసూరు సమీపంలో ఉన్న లింగాంబుధి చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ వాళ్లు ఏకాంతంగా గడపడాన్ని గమనించిన నలుగురు యువకులు.. వారిపై దాడి చేశారు.

శివసిద్ధు కాళ్ల మీద పెద్ద బండరాయి వేసి అతడిని తీవ్రంగా గాయపరిచారు. అనంతరం… అక్కడే ఆ యువతిపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. కొంతసేపటి తర్వాత శివసిద్ధు… ఎలాగోలా.. ఆ యువతిని మైసూర్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తన కాళ్లకు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో అతడు కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆసుపత్రికి వెళ్లి బాధితుల వాంగ్మూలం తీసుకున్నారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news