యువతితో మాట్లాడుతున్నాడని చంపేశారు..!

-

అమ్మాయితో మాట్లాడినంత మాత్రాన చంపేయడమేనా? ఇదేం లోకంరా బాబు అంటూ బాధపడుతున్నారా? ఏం చేస్తాం బాస్.. కలికాలం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని కిద్వాయీ నగర్ లో చోటు చేసుకున్నది.

కిద్వాయీ నగర్ లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్ లో అంకిత్ అనే విద్యార్థి సాయంత్రం పూట టూషన్ కు వెళ్తున్నాడు. అంకిత్ 11వ తరగతి చదువుతున్నాడు. అయితే.. కోచింగ్ సెంటర్ లో అంకిత్ తన తోటి క్లాస్ మెట్ అయిన ఓ విద్యార్థినితో మాట్లాడుతున్నాడట. ప్రతిరోజు అంకిత్ ఆ యువతితో మాట్లాడటం నచ్చని కొంతమంది యువకులు ఓరోజు కాపుకాసి దాడి చేశారు. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. హాస్పిటల్ కు తరలించే లోపే అంకిత్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news