నిమ్మగడ్డకు లిస్ట్ పంపిన సీఎస్.. ఎవరిని సెలెక్ట్ చేస్తారో ?

-

ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్ట్ నుంచి వాణీమోహన్‌ను తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్  కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి వాణీమోహన్‌ను నిమ్మగడ్డ రిలీవ్ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందే జాయింట్ డైరెక్టర్ సాయి ప్రసాద్‌ను కూడా విధుల నుంచి తొలగించారు నిమ్మగడ్డ.

దీంతో తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ పోస్టు ముగ్గురు అధికారుల ప్రతిపాదన చేస్తూ ముగ్గురు ఐ ఏ ఎస్ అధికారుల ప్యానెల్ ను ఎస్ ఈ సికి ప్రభుత్వం పంపింది. మున్సిపల్ శాఖ కమీషనర్ విజయ్ కుమార్, సెర్ప్ సి ఈ ఓ రాజబాబు, మత్స్య శాఖ కమీషనర్ కన్నబాబు పేర్ల ప్రతిపాదించారు. ఎస్ ఈ సి సూచించిన వారిని సెక్రటరీగా ప్రభుత్వం నియమించాల్సి ఉంటుంది. ఇక ద్వివేది, గిరిజా శంకర్ ల విషయంలో ప్రభుత్వం మళ్ళీ నిమ్మగడ్డతో రణానికి సిద్దం అయింది. 

Read more RELATED
Recommended to you

Latest news