వారి కోసం ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్‌లు : సీఎస్‌ శాంతి కుమారి

-

తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్‌కే భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మెహంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటివరకు క్షేత్ర స్థాయి క్యాంప్‌ల‌ నిర్వహణ విజయవంతంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 97,335 మందికి కళ్ళద్దాల పంపిణీ చేసినట్లు శాంతి కుమారి తెలిపారు. అన్ని జిల్లాల్లో వున్న బఫర్ టీమ్స్ ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలీయన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్‌ల‌ వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్‌ల‌ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు శాంతి కుమారి సూచించారు. కంటి అద్దాల నిల్వలను (స్టాక్స్) వివరాలను రోజు వారిగా సరిచూసుకోవాలని శాంతి కుమారి పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాంప్‌ల‌ నిర్వహణ చేపట్టాలని సీఎస్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news