నాలో ఓ భాగం దూరం అవుతున్న ఫీల్ వచ్చింది.. నమ్రతా ఎమోషనల్ పోస్ట్‌

-

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబుతో పెళ్లి తర్వాత సినిమాలకి దూరమై ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉండిపోయారు. ఒక వైపు తమ ఇద్దరు పిల్లలు గౌతమ్ మరియు సితారను చూసుకుంటూనే మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా చేదోడువాదోడుగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉండే నమృత ఎప్పటికప్పుడు పిల్లల గురించి లేదా మహేష్ బాబు కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా ఆమె ఓ ఎమోషన్‌ పోస్ట్‌ చేశారు. తన కొడుకు గౌతమ్ తనను విడిచి ఫస్ట్ టైం ఫారెన్ టూర్ వెళ్తున్నాడంటూ ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ‘గౌతమ్ నన్ను విడిచి ఫస్ట్ టైం ఫారిన్ కల్చరల్ ట్రిప్ కి వెళ్లాడు. నాలో ఓ భాగం దూరం అవుతున్న ఫీల్ వచ్చింది. దీన్ని జీర్ణించుకోవడానికి చాలా సమయం పట్టింది. రోజంతా శూన్యంగా ఉంది. గౌతమ్ తిరిగి కళ్ల ముందు కనబడే వరకు ఈ బాధ తీరదు. మా బుజ్జి కన్నకు రెక్కలొచ్చి ఎగిరిపోయాడు. ఈ ట్రిప్ నీకు ఎన్నో అనుభవాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. నీ కోసం ఎదురుచూస్తూ ఉంటా’’ అని నమ్రతా పోస్ట్ చేశారు. గౌతమ్ తన ఫ్రెండ్స్ తో ఉన్న ఫోటోలను షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news