టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న చర్యలతో చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని.. టీడీపీ పాలనలో జరిగిన ప్రతీ అవినీతిలో చంద్రబాబు, లోకేష్ ల హస్తం ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే అచ్చెన్నాయుడి అరెస్టును రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారని, దీనిలోకి కులాన్ని లాగి రాజకీయంగా లబ్ధిపొందేందుకు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాగే అచ్చెన్నాయుడుపై ఇంత ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు.. ఆనాడు కోడెల శివప్రసాద్ మీద ఎందుకు చూపించలేదని వీరభద్ర రావు ప్రశ్నించారు. కోడెల మృతికి చంద్రబాబే కారణం అని ఆరోపించారు. అదేవిధంగా సీఎం జగన్ దయ వలనే టీడీపీ ఈ రోజు బతికి ఉందని, టీడీపీలో 22 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన బాంబ్ పేల్చారు. కాకపోతే రాజీనామా చేసి రావాలంటూ జగన్ పెట్టిన షరత్తుతో అందరూ ఆగిపోయారని అని తెలియజేశారు.
కోడెల మృతికి చంద్రబాబే కారణం : దాడి
-
Previous article
Read more RELATEDRecommended to you
అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్..వైసీపీ నేతల ఇండ్లపై టీడీపీ దాడులు ?
అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో...
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..దర్శనానికి ఎంత సమయం అంటే
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల...
బొల్లారంలో విషాదం…బిల్డింగ్ గోడ కూలి ఒకరి మృతి
బొల్లారంలో విషాదం చోటు చేసుకుంది. బిల్డింగ్ గోడ కూలి ఒకరి మృతి...