దారుణం: 2 వేల కేజీల టమాటా లోడ్ చోరీ…

-

గత మూడు వారాల నుండి దేశ వ్యాప్తంగా టమాటాలు ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. ఒక కేజీ టమోటా ఏకంగా రూ. 150 పలుకుతున్న నేపథ్యంలో సామాన్యుడికి గుదిబండగా తయారయింది. దీనితో టమోటాలు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు పేద ప్రజలు. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటకలో జరిగిన ఒక ఘటన వైరల్ గా మారుతోంది. తెలుస్తున్న వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన చిత్రదుర్గ ప్రాంతంలోని రైతు తాను పండించిన 2 వేల కిలోల టమోటాను కోలార్ మార్కెట్ కు తరలించే ప్రక్రియలో… ముగ్గురు దుండగులు అతని వాహనాన్ని ఫాలో చేస్తూ వచ్చి.. ముందుగా వారు మా కారును ఢీ కొట్టారని వాదనకు దిగి, టమోటా రైతును మరియు డ్రైవర్ ను కొట్టారు. ఆ తర్వాత రైతు మరియు డ్రైవర్ ఇద్దరినీ అక్కడే వదిలేసి ఆ లోడ్ తో అక్కడి నుండి పరారయ్యారు.

ఇప్పుడు రైతు మరియు వాహనం యొక్క డ్రైవర్ సమాచారం మేరకు పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును స్టార్ట్ చేశారు. టమోటాలు కోసం దొంగతనాలు చేసేంత స్థాయికి వెళ్లిపోయారంటే దీని విలువ ఏమిటో అర్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news