బ్రేకింగ్: గంగా నదిలో ఇంకా వస్తూనే ఉన్న శవాలు, తింటున్న కుక్కలు

-

గంగా నదిలో ఇంకా శవాలు వస్తూనే ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు దీనికి సంబంధించి విచారణకు ఆదేశించారు. అయితే ఎన్ని శవాలు వచ్చాయి ఏంటీ అనే దానిపై స్పష్టత లేదు. అక్కడి స్థానికులు మాత్రం ప్రయాగ్ రాజ్ నుంచి ఈ శవాలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పటి వరకు వంద శవాలు వెలికి తీసారు.

ఇక గంగా నదిలో వస్తున్న శవాలకు సంబంధించి పోలీసులు దృష్టి పెట్టారు. ఆస్పత్రులను తనిఖీలు చేయడానికి కూడా సిద్దమయ్యారు. ఇక గంగా నది పరివాహక ప్రాంతంలో కుక్కలు శవాలను పీక్కు తింటున్నాయి. దీనికి సంబంధించిన ఫోటో లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీహార్ లో బక్సర్ జిల్లాకు ఇవి భారీగా వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news