ఎంపీ ర‌ఘురామ అరెస్టుపై బండి సంజ‌య్ సంచ‌ల‌న కామెంట్లు

-

వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈయ‌న అరెస్టుపై అటు ఏపీలోని, ఇటు తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీలు భ‌గ్గుమంటున్నాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. లాక్‌డౌన్ ఉన్న‌టైమ్‌లో తెలంగాణ‌లోకి అంత‌మంది పోలీసులు ఎలా వ‌చ్చారంటూ మండిప‌డ్డారు.

తెలంగాణ బార్డ‌ర్‌లో అంబులెన్సుల‌ను ఆపేస్తున్న ప్ర‌భుత్వం.. అంత‌మంది పోలీసుల‌కు ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చిందంటూ మండి ప‌డ్డారు. సీఎం కేసీఆర్ త‌న మిత్రుడు జ‌గ‌న్ కోస‌మే ఇదంతా చేశారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అసలు ఏపీలో ప్ర‌భుత్వం ఉందా అనే అనుమానం క‌లుగుతోంద‌ని సంజ‌య్ విమ‌ర్శించారు. ర‌ఘురామ‌కు 4నెల‌ల క్రిత‌మే గుండెకు ఆప‌రేష‌న్ అయింద‌ని, అలాంటి పేషెంట్‌ల‌ను పోలీసులు ఎలా ఈడ్చెకెళ్లార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక ఎంపీకి దేన్నైనా విమ‌ర్శించే స్థాయి ఉంటుంద‌ని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news