నిరుద్యోగులకు శుభవార్త..గురుకులాల్లో 10 వేల పోస్టుల భర్తీకి నిర్ణయం !

-

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. సంక్షేమ గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో పోస్టుల భర్తీకి మార్గం సుగమం అయింది. గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు పదివేల పోస్టుల భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతన జోనల్ విధానం అమలు పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు.

అయినా కొత్తగా… గుర్తించిన పోస్టులతో పాటు గతంలో మంజూరైన వాటి భర్తీకి నూతన జోనల్ విధానం మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపించారు. ఈ భర్తీ అయితే పోలీస్ శాఖ తర్వాత అత్యధిక పోస్టులు గురుకులాల్లో నే ఉంటాయని సమాచారం.

రాష్ట్రంలో 970 గురుకుల పాఠశాలలు పని చేస్తున్నాయి. ఈ లెక్కన పరిపాలన సంబంధిత పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో అదనంగా గుర్తించిన బోధన సిబ్బంది పోస్టులు అన్నీ కలిపి పది వేలకు పైగా ఉన్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news