IPL 2022 : ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ న్యూస్.. స్టార్ అల్ రౌండర్ రీ-ఎంట్రీ

-

ఢిల్లీ క్యాపిటల్ జట్టుకు అదిరిపోయే శుభవార్త అందింది. గాయం కారణంగా ఈ మెగా లీగ్ కు దూరమవుతాడు అనుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ తిరిగి జట్టులోకి రానున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది. “మిచెల్ మార్ష్ ఇండియా వెళ్లి అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియోథెరపిస్ట్ ప్యాట్రిక్ ఫర్ హాట్ ఆధ్వర్యంలో చికిత్స తీసుకొని కోలుకున్నాక జట్టులోకి చేరతాడు.

గాయం నుంచి ఇటీవలే మిచెల్ మార్ష్ మార్చుకున్నాడు. క్రికెట్ ఆడడానికి ఇప్పుడు మిచెల్ మార్ష్ అర్హుడు.”అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. కాగా పాక్-ఆస్ట్రేలియా సిరీస్ నేపథ్యంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో మిచెల్ మార్ష్ గాయపడి ఆ టోర్నీ నుంచి వైదొలిగాడు.

దీంతో ఐపీఎల్ 2022 లీగ్ కు కూడా ముత్తం గా దూరం అవుతాడని వార్తలు వచ్చాయి. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో మిచెల్ మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్… వేగంగా 6.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంకా ఇప్పటివరకు మిచెల్ మార్స్ ఐపీఎల్ టోర్నీలో 21 మ్యాచులు ఆడి 225 పరుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news