ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం… 7గురు సజీవ దహనం, పలు గుడిసెలు దగ్ధం

-

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. గత అర్థరాత్రి అగ్రి ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఢిల్లీలోని గోకుల్ పురి ప్రాంతంలోని మురికివాడల్లోని పూరిగుడిసెల్లో ముందుగా అగ్రి ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అలెర్ట్ అయిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. రాత్రి 1 గంటలకు ప్రారంభం మంటలను తెల్లవారుజామున 4 గంటలకు ఆర్పేశారు. దాదాపు 13 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేశారు. కిలోమీటర్ వరకు దట్టమైన పొగలు అలుముకున్నాయి. 

ఈ ఘటనలో 60 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. అర్థరాత్రి ప్రజలు నిద్రలో ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. నిద్రలో ఉన్న 7 గురు సజీవదహనం అయ్యారు. చాలా వేగంగా మంటలు విస్తరించడంతో వీరు తప్పించుకోలేకపోయారు. దీంతో సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని.. అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో 60 ఇళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news