విజృంభించిన ఢిల్లీ.. కోల్‌క‌తా ల‌క్ష్యం 229..

-

షార్జాలో జ‌రుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 16వ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ విజృంభించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ కోల్‌క‌తా బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. ఆరంభం నుంచి ఎడ‌తెరిపి లేకుండా బౌండరీలు, సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 228 ప‌రుగులు చేసింది.

delhi made 228 runs against kolkata in ipl 2020 16th match

మ్యాచ్‌లో కోల్‌క‌తా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా ఢిల్లీ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ (88 ప‌రుగులు నాటౌట్‌, 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), పృథ్వీ షా (66 ప‌రుగులు, 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), రిష‌బ్ పంత్ (38 ప‌రుగులు, 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌)లు అద్భుతంగా రాణించారు. దీంతో ఢిల్లీ భారీ ల‌క్ష్యాన్ని కోల్‌క‌తా ఎదుట ఉంచ‌గ‌లిగింది.

కాగా కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ఆండ్రె ర‌స్సెల్ 2 వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, క‌మ్‌లేష్ నాగ‌ర్‌కోటిలు చెరొక వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు కోల్‌క‌తా బౌల‌ర్లు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌పై ఏ మాత్రం ఒత్తిడి తేలేక‌పోయారు. పేల‌వ‌మైన బౌలింగ్‌తో కోల్‌క‌తా బౌల‌ర్లు నిరాశ ప‌రిచారు.

Read more RELATED
Recommended to you

Latest news