ఢిల్లీ VS రాజస్థాన్: హై స్కోరింగ్ మ్యాచ్ లో టాస్ గెలిస్తే బ్యాటింగ్ పక్కా !

-

ఈ రోజు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ లో గౌహతి వేదికగా తలపడనున్నాయి. రాజస్థాన్ లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోగా… ఢిల్లీ మాత్రం ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయి ఒత్తిడిలో బరిలోకి దిగనుంది. కాగా ఇక్కడ పిచ్ ను బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో 200+ పరుగులు సులభంగా నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే మొదట టాస్ గెలిచిన ఏ జట్టు అయినా బ్యాటింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ పరుగులు చేసి ఛేజింగ్ లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడానికి అవకాశం ఉంటుంది.

కాబట్టి ఈ మ్యాచ్ లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది, రెండు టీం లకు ఈమ్యాచ్ లో గెలవడం చాలా ప్రధానం అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో ఢిల్లీ టీం లో కొన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. వరుసగా విఫలం అవుతున్న సర్ఫరాజ్ ఖాన్ లేదా పృథ్వీ షా లలో ఒకరిని తప్పించడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాజస్థాన్ కూడా పడిక్కల్ ను పక్కన పెడుతుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news