హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. MMTS సబ్ అర్బన్ సర్వీసుల్ని ప్రారంభించిన మోడీ

-

హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త చెప్పారు ప్రధాని మోడీ. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన శిలాఫలకం, సికింద్రాబాద్- మహబూబ్ నగర్ డబ్లింగ్ పనులకు సంబంధించిన శిలాఫలకం ఆవిష్కరణ చేశారు ప్రధాని మోడీ. హైదరాబాద్- సికింద్రాబాద్ 85 కిలోమీటర్ల ఎంఎంటీఎస్ సబ్ అర్బన్ సర్వీసుల్ని ప్రారంభించిన ప్రధాని మోడీ… అనంతరం తెలుగులో ప్రసంగం మొదలు పెట్టారు.

కాగా సికింద్రాబాద్ మరియు తిరుపతి మధ్యన ప్రయాణించే వందే భారత్ ట్రైన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటికీ ఈ మార్గమధ్యంలో ట్రైన్ లు ఉన్నప్పటికీ.. ఈ కొత్త ట్రైన్ ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని శంకుస్థాపనల పనులను ముగించుకుని వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయంలో జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోదీని రిసీవ్ చేసుకోవడానికి వహ్సిన తెలంగాణ మంత్రి తలసాని, గవర్నర్ తమిళిసై , బీజేపీ ఎంపీలు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news