తమకు రాజకీయాల కంటే అభివృద్ధే ముఖ్యం :ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

-

తమకు రాజకీయాల కంటే అభివృద్ధే ముఖ్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… త్వరలోనే వనమహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు. 37 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ,సీసీ రోడ్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 7లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. ఇక వాటికి ఇటీవలే 38వేల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించామని తెలిపారు. గత ప్రభుత్వ పాపాన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కునారిల్లి పోయిందని మండిపడ్డారు.అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం కోసం టెండర్ ప్రక్రియలో మెఘ కంపెనీ చేజిక్కించుకుంది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ ల సహకారంతో కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. బడులు మొదలైన మొదటి రోజునే పుస్తకాలు, స్కూల్ డ్రెస్ లు పంపిణీ చేశాము. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ప్రమోషన్ల బదిలీలు పారదర్శకంగా ఆన్ లైన్‌లో చేపడుతున్నాము. ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదూయిపాయలు కల్పిస్తున్నాము.మహిళా సంఘాల పర్యవేక్షణలతోనే ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news