చంద్రబాబు ను ఆ పాపమే వెంటాడిందా…?

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కరోనా విజృంభనతో ఆర్ధికంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినా మాట ఇస్తే మడమ తిప్పని నేతలా వైయస్సార్ ఆసరా పథకాన్ని మహిళలకు అమలు పరిచాడని అన్నారు. గతంలో డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశాడని ఆయన మండిపడారు. పేదల కోసం ప్రభుత్వం నివాస స్థలాల పంపిణి కార్యక్రమాన్ని చేపడితే చంద్రబాబు కోర్టుల ద్వారా ఆ కార్యక్రమాన్ని అడ్డుకొని పేదలకు పట్టాలు అందకుండా చేస్తున్నాడని విమర్శించారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టాల పంపిణీని నెరవేర్చి తీరుతామని ఆయన స్పష్టం చేసారు. ఈరోజు చంద్రబాబు మతాలను, కులాలను రెచ్చగొడుతున్నాడని ఆయన ఆరోపించారు. రథాలను తెలుగుదేశం పార్టీవారే ధ్వంసం చేసి ఆ నెపాన్ని మా ప్రభుత్వంపై నెట్టాలనే ప్రయత్రం చేశారన్నారు. నిష్పక్షపాత విచారణ చేపట్టేందుకే సీబీఐ విచారణ చేపట్టాలని సిఎం జగన్ కోరారని ఆయన పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలలో 30మందిని బలితీసుకున్న చంద్రబాబుకు ఆ దేవుడే తగిన బుద్ది చెప్పాడని మంత్రి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news