BREAKING : పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. కాగా, తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

తాను నిర్మించిన లడ్కి సినిమాను ఆపాలంటూ కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు నిర్మాత శేకర్ రాజు. దీంతో సినిమాను అన్ని భాషల్లో నిలుపుదల చేయాలంటూ హైదరబాద్ సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై నేడు పంజాగుట్ట పీఎస్ లో పిర్యాదు చేయనున్నారు రామ్ గోపాల్ వర్మ.

రామ్ గోపాల్ వర్మతో ఓ సినిమా చేయడం కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు ఇచ్చిన నిర్మాత శేఖర్ రాజు.. ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా వర్మ దాటవేస్తూ వస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఈ విషయమై తన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టును ఆశ్రయించారు శేఖర్ రాజు. దీంతో ఆర్జీవీ తెరకెక్కించిన లడ్కి సినిమాను అన్ని భాషల్లో నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news