ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత

-

సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్​లో ఇటీవల ఎక్కువగా విషాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే సీనియర్ నటి జమున మృతి చెందారు. ఆ బాధ నుంచి ఇండస్ట్రీ ఇంకా బయటపడకముందే మరో విషాదం చోటుచేసుకుంది.

తాజాగా ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూశారు. చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు ఇండస్ట్రీలో స్టువర్ట్​పురం, అమ్మదొంగ వంటి సినిమాలకు సాగర్ దర్శకత్వం వహించారు. ఈయన తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news