దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఇంట్లో విషాదం..!

-

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య కన్నుమూశారు. 89 ఏళ్ల శేషయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఉదయం 6 గంటలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే శేఖర్ కమ్ముల తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేట స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా “లవ్ స్టోరీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే సంబందించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. ఈ సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. కాగా,  లాక్‌డౌన్ స‌మ‌యంలో అనేక సేవా కార్యక్ర‌మాలు చేశారు శేఖ‌ర్ క‌మ్ముల‌. హిజ్రాల‌కి నిత్యావ‌స‌రాలు అందించ‌డంతో పాటు జీహెచ్ఎంసీ కార్మికుల‌కి నెల రోజుల పాటు మ‌జ్జిగ‌తో పాటు ఆరోగ్యానికి సంబంధించిన‌వి అందించారు. ప్లాస్మా దానం చేయాల‌ని కూడా కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news