సూపర్ స్టార్ పై సంచలన వ్యాఖ్యలు..దొరికితే చంపేస్తాం అంటున్న ఫ్యాన్స్…!

-

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే అభిమానులకు ఒక దేవుడి తోసమానం అని చెప్పాలి. సినిమాల్లో హీరోలుగా ఉన్నప్పుడు ఎంతగా ఆకాశానికి ఎత్తుతారో రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుపగానే ఇప్పుడు ఆ సూపర్ స్టార్ పై విమర్శలు చేసి వేలెత్తి చూపుతున్నారు. అయితే అలాంటి సూపర్ స్టార్ పై తమిళ దర్శకుడు, నటుడు ఆర్.సుందర రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయన అంటేనే ప్రాణాలు ఇచ్చే అభిమానులు రాజన్ దొరికితే చంపేస్తాం అంటూ మండిపడుతున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. దాంతో ఫ్యాన్స్ కూడా మండి పడుతున్నారు. వయసొచ్చింది కానీ బుద్ధి మాత్రం రాలేదంటూ ఆయనపై తెగ మండిపడుతున్నారు. తమిళనాడుకు అన్నాదురై ముఖ్యమంత్రి అయినప్పుడు టీచర్స్ అంతా చాలా సంతోషించారని.. ఎందుకంటే సీఎం అవడానికి దు అన్నాదురై కూడా టీచర్ ప్రొఫెషన్‌లోనే ఉన్నాడని గుర్తు చేసాడు ఈయన. కానీ టీచర్లు ఎవ్వరూ ఆయన్ను ఫాలో అయ్యి సీఎం అవ్వాలని అనుకోలేదని చెప్పాడు.

ఇక మహానుభావుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని తెలిసిన తర్వాత చాలా మంది తమకు ఉన్న అర్హతలు కూడా మరిచిపోయి నటుడు కావాలని ఇండస్ట్రీకి వచ్చారని కొందర్ని టార్గెట్ చేసి మాట్లాడాడు సుందర రాజన్. ఇన్ డైరెక్టుగా రజినీకాంత్ పార్టీతో పాటు ఆయన్ని కూడా ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేసారు. నిజంగానే రజినీ పార్టీ మీటింగ్ పెడితే తిరుపూరు చేరుకునేలోపే ఆయన చచ్చిపోతాడు.. అంత దారుణంగా ఉంది ఇప్పుడు ఆయన ఆరోగ్యం అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం తో సూపర్ స్టార్ అభిమానులు సుందర రాజన్ అంటేనే మండిపడుతున్నారు. దొరికితే ఆయనను చంపేయాలి అన్నంత రేంజ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news