Telangana : నేడు బడ్జెట్‌పై ఉభయ సభల్లో సాధారణ చర్చ

-

తెలంగాణ బడ్జెట్​పై ఇవాళ ఉభయ సభల్లో సాధారణ చర్చ జరగనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళికను సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ పై ఇవాళ శాసనసభ, శాసనమండలిలో చర్చ జరగనుంది. అనంతరం రెండు సభల్లో జరిగిన చర్చకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమాధానం ఇస్తారు.

అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దుచేసి నేరుగా బడ్జెట్​పై చర్చ చేపడతారు. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవికి శాసనసభ సంతాపం ప్రకటించనుంది.

కౌన్సిల్​లో ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్ పై చర్చ చేపడతారు. మన ఊరు – మన బడి, జంటనగరాల్లో సీసీటీవీలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ట్రాఫిక్ నిర్వహణ, ఆసరా ఫించన్లు, నకిలీ విత్తనాలు – ఎరువులు తదితర అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్సీలు వెలిచాల జగపతిరావు, జస్టిస్ ఎ.సీతారామరెడ్డికి కౌన్సిల్ సంతాపం తెలపనుంది.

Read more RELATED
Recommended to you

Latest news