సూర్య సినిమాతో కోలీవుడ్ లోకి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఎంట్రీ

-

టాలీవుడ్ లో లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ దిశా పటానీ. ఆ మూవీ తర్వాత ఈ అమ్మడు తన మకాం బాలీవుడ్ కి మార్చేసింది. అప్పటి నుంచి బాలీవుడ్ లో అందిన అవకాశాలను సరైన రీతిలో యూజ్ చేసుకుంటూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకుంది. బాలీవుడ్ లో బిజీ అయిన ఈ భామ.. ఇప్పుడు మళ్లీ దక్షిణాదివైపు తన మకాం మార్చేస్తోంది. వరుసగా దక్షిణాది సినిమాలు చేయడానికి రెడీ అయింది.

 

తెలుగులో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే’ సినిమాలో దిశా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పుడు మరో సూపర్ ఆఫర్ అందుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. సూపర్ కూల్ హీరో సూర్యాతో దిశా కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది.  శివ దర్శకత్వంలో ‘సూర్య 42’వ చిత్రం పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతోంది.  కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, వంశీ – ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దిశా పటానీ కథానాయిక.

యోగిబాబు, రెడిన్‌ కింగ్సే, కోవై సరళ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం గోవాలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడీ షెడ్యూల్‌తోనే చిత్ర సెట్లోకి అడుగు పెట్టింది దిశా. ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. సెట్లోని చిన్న వీడియో క్లిప్‌ను పంచుకుంటూ.. ‘సూర్యతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాన’ని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news