కేటీఆర్ భాషలో తండ్రిని మించిపోయారు – DK అరుణ

-

కేటీఆర్ భాషలో తండ్రిని మించిపోయారని ఫైర్‌ అయ్యారు DK అరుణ. TSPSC లీకేజీ లో ఏ ఒక్క మంత్రి కూడా నోరు విప్పలేదు.. పదో తరగతి ప్రశ్న పత్రం వాట్సప్ లో బండి సంజయ్ కి చేరడం నేరమా ? అని నిలదీశారు. బీజేపీని ప్రజల్లో ఎదుర్కొనే శక్తి లేక బట్ట కాల్చి మీద పడేస్తున్నారు.. కేటీఆర్ భాషలో తండ్రిని మించిపోయారన్నారు.ప్రజల దృష్టిని మళ్లించేందుకు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు.. పిచ్చోడి చేతిలో రాయి… అది కేటీఆర్ కే వర్తిస్తుందని తెలిపారు DK అరుణ.

పోలీసులు పూటకో మాట మాట్లాడుతున్నారు.. ప్రధానిని కూడా లెక్క చేయకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారన్నారు. హోదా, గౌరవాన్ని IAS, IPS లు పోగొట్టుకోవద్దని తెలిపారు. TSPSC లీకేజీ వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి అరెస్ట్ లు చేశారు.. IPS, IAS లు నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. నియంత పోకడలను సమర్థించే అధికారులను చరిత్ర క్షమించదని ఫైర్‌ అయ్యారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నం అంటూ దొంగ కేసులు పెట్టారు.. భవిష్యత్ తరాలకు స్ఫూర్తి గా IAS, IPS లు ఉండాలన్నారు DK అరుణ.

Read more RELATED
Recommended to you

Latest news