కెసిఆర్ పచ్చి జూటా కోర్ – డీకే అరుణ

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని గాజులరామారం చిత్తారమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. అనంతరం కట్ట మైసమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

తర్వాత సూరారం కాలనీలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పచ్చి జూటా కోర్ అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అభివృద్ధి చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా? అంటూ మండిపడ్డారు. కెసిఆర్ తన సర్కారు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ పార్టీ అంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పారు. కెసిఆర్ నియంత పాలనను బిజెపి అంతం చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news