కార్యకర్త చెంప చెళ్ళుమనిపించిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు..

-

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, కార్యకర్త చెంప చెళ్ళుమనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వద్దకు వస్తున్న కార్యకర్త చెంప చెళ్ళుమనిపించి కెమెరాలకు చిక్కారు. తన భుజంపై చేయి వేయడానికి వచ్చిన కార్యకర్తను దూరం జరపడానికి అన్నట్టు, చెంప వాయించారు. ప్రస్తుతం ఈ విషయంలో అటు బీజేపీ, ఇటు సోషల్ మీడియా తీవ్ర విమర్శలకు గురి చేస్తుంది. ఇదంతా రికార్డ్ చేస్తున్న మీడియాను ఉద్దేశించి, వీడియో డిలీట్ చేయమని చెప్పడం ఇంకా ఆసక్తిగా మారింది.

ఈ సంఘటన మాండ్యా జిల్లాలో జరిగింది. సీనియర్ నాయకులు జి మేడ్ గౌడ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుందామన్న ఉద్దేశ్యంతో అక్కడకు వచ్చిన డీకే శివకుమార్, తనకు చిరాకు తెప్పించిన కార్యకర్త చెళ్ళుమనిపించాడు. ఇలా చేయడానికి కారణానికి వెల్లడించిన శివకుమార్, కరోనా పరిస్థితులు ఉన్నాయని, భౌతిక దూరం పాటించనందువల్లే అలా చేసానని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news