ఉదయనిది స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు..వివాదంలో చిక్కుకున్న డీఎంకే !

-

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. మోదీ టార్చర్ తోనే సుష్మాస్వరాజ్ జైట్లీ చనిపోయారని ఉదయనిది స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ వ్యక్తిత్వంతో పార్టీలో సీనియర్ లు క్షోభ అనుభవిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీనియర్లు అంటే మోడీ కి ఏమాత్రం గౌరవం లేదని ఆయన ఆరోపించారు. అయితే ఇదిలా ఉంటే ఉదయనిది వ్యాఖ్యల మీద జైట్లీ సుష్మా స్వరాజ్ కుటుంబ సభ్యులు తాజాగా స్పందించారు.

రాజకీయాల కోసం తమ కుటుంబాలను వాడుకోవద్దని ట్వీట్ చేశారు. అంతేకాక ఉదయనిది వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెండు కుటుంబాలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు డీఎంకే వివాదాల్లో చిక్కుకున్నట్టు అయింది. ఇక మొన్నీమధ్య ఇదే ఉదయనిది స్టాలిన్ మీద బీజేపీ నేత రాధారవి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోయిన్ నయనతార తో ఈయనకు అక్రమ సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. గతంలో ఈ విషయాన్ని తెలిపినందుకే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆయన విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news