కరోనా ఇబ్బందుల్లో.. ఇంత దారుణమా.. టాలీవుడ్ హీరో ఫైర్..?

-

టాలీవుడ్ నటుడు శివ బాలాజీ ఇటీవలే సరికొత్త పోరాటాన్ని మొదలు పెట్టారు. కరోనా సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తు.. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక శివబాలాజీ వ్యాఖ్యలు చేస్తున్న పోరాటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే కొంతమంది శివ బాలాజీ కి మద్దతు ప్రకటిస్తే కొంతమంది కామెంట్లు కూడా చేశారు.

ఇదిలావుంటే ఇటీవల మరోసారి మీడియాతో మాట్లాడిన శివ బాలాజీ… ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు పై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు పడుతూ పిల్లలను చదివిస్తోంటే ప్రవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం అధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక అంతకు ముందు… తాము తమ పిల్లలకు 35% ఫీజులు చెల్లించినప్పటికీ తమ పిల్లలను స్కూలు యాజమాన్యం పరీక్షలు రాయనివ్వకపోవడం దారుణం అంటూ వ్యాఖ్యానించారు శివబాలాజీ భార్య మధుమిత.

Read more RELATED
Recommended to you

Latest news