విఘ్నేష్ కట్నం కింద ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?

-

ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో క్రేజీ టాపిక్ గా మారిన విషయం నయనతార , విఘ్నేష్ పెళ్లి . ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నయనతార పెళ్లి విఘ్నేష్ శివన్ తో జరిగిపోయింది. ఇక గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్న వీరిద్దరూ.. నేడు ఉదయం 8:10 గంటలకు మహాబలిపురంలో ఉన్న షెరటాన్ లగ్జరీ హోటల్లో వీరి వివాహం జరిగింది. ఇక వీరి వివాహానికి అతిరథమహారధులు.. సినీ సెలబ్రిటీలు.. కుటుంబసభ్యులు.. సన్నిహితులు ఇలా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యారు. ఇకపోతే అక్కడక్కడ వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వీరి పెళ్లికి ఎవరెవరు హాజరయ్యారు.. నయనతార నుంచి విఘ్నేష్ కట్నం కింద ఎంత తీసుకున్నారు అనే విషయాలు బాగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఇప్పుడు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. ముందుగా తమ పెళ్లి కానుక గా నయనతారకు .. విఘ్నేష్ రూ.2.5 కోట్ల రూపాయల విలువ చేసే డైమండ్ రింగ్ ను కానుకగా ఇచ్చినట్లు సమాచారం. అంతే కాదు పెళ్లికి ఆమె ధరించడానికి రూ.3 కోట్ల విలువ చేసే నగలను కూడా విఘ్నేష్ బహుమతిగా ఇచ్చారట. ఇక తన వివాహ వేడుకకు నయనతార ధరించిన గద్వాల్ చీర విలువ అక్షరాలా 5 లక్షల రూపాయలు. ఇక బంగారు దారాలతో ఈ చీరను నేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ పెళ్లికి ఆమె ధరించిన చీర హైలెట్గా నిలుస్తుందని కొంతమంది చెబుతున్నారు.

ఈ పెళ్లికి నయనతార ఎంత కట్నం ఇచ్చింది అనే విషయానికి వస్తే ఆమె 20 కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత లగ్జరీ విలాసవంతమైన ఇంటిని విఘ్నేష్ శివన్ పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించింది నయనతార. ఆమె సినిమాల ద్వారా సంపాదించిన సుమారుగా రూ. 500 కోట్లకు పైగా ఆస్తి మొత్తం ఇక వివాహం అనంతరం వీరిరువురికీ సొంతమని తెలుస్తోంది. మొత్తానికి అయితే లేడీ సూపర్ స్టార్ ను పరిణయమాడి విఘ్నేష్ శివన్ అదృష్టవంతుడు అయ్యాడు అని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news