175 స్థానాలను వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళాలేస్తాం – అచ్చెన్నా

-

175 స్థానాలను వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళాలేస్తామని.. ఏపీ ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. 175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామనే నమ్మకం ఉంటే జగన్ తన ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయాలి… ఎన్నికలకు జగన్ సిద్దపడాలని ఛాలెంజ్‌ చేశారు. వైసీపీ నేతలు ఫేక్‌ గాళ్లు..జూమ్‌ మీటింగ్‌ కు అడ్డు తగిలారని ఆగ్రహించారు అచ్చెన్నాయుడు.

వైసీపీ నేతలు, పార్టీ ఫేక్ అని మరోసారి బయటపడిందని. విద్యార్థులు, తల్లిదండ్రులకు లోకేష్ ధైర్యం చెప్పే కార్యక్రమానికి పదో తరగతి కూడా పాస్ కాని సన్నాసులు అడ్డు తగిలారని మండిపడ్డారు. అమ్మఒడికి కోత విధించడం కోసమే 2 లక్షల మంది విద్యార్థుల్ని ఫెయిల్ చేశారని ఫైర్‌ అయ్యారు.

ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసినందుకా.. వైసీపీకి ఓట్లేసేది..? చెత్త మీద పన్ను వేసిన చెత్త పాలనకా ఓట్లేయాల్సింది..? అని నిలదీశారు. ఒక్క ఉద్యోగం లేదు.. ఒక్కరికీ ఉపాధి లేదు. ఎందుకెయ్యాలి ఓట్లు..? రోడ్ల మీద ప్రయాణం చేయాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుంటున్నారని ఆగ్రహించారు. మళ్లీ జగనుకే ఓట్లేసేంత అమాయకులు కాదు ప్రజలు… ఉద్యోగులనూ నానా ఇబ్బంది పెట్టారని ఫైర్ అయ్యారు. ల్యాండ్-శాండ్-వైన్-మైన్ వ్యవస్థలను సొంత మనుషులకు అప్పజెప్పారని.. విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news