7.5 కేజీల కిడ్నీని తొలగించిన వైద్యులు…! చూసి ఆశ్చర్యపోయారు…!

-

మామూలుగా 120-150 గ్రాముల బరువు ఉండాల్సిన కిడ్నీలు ఏకంగా 7.5 కేజీల ఉంటే.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కేస్తుంది.

భారతీయ వైద్యులు 7.5 కిలోల (16.3 పౌండ్లు) బరువున్న మూత్రపిండాలను ఒక రోగి నుంచి తొలగించారు. ఈ సంఘటన ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో జరిగింది. వివరాల్లోకి వెళితే… ఢిల్లీలోని ఒక మహిళ… ఇద్దరు నవజాత శిశువులకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఆమె నుంచి ఆ మూత్ర పిండాలని తొలగించారు వైద్యులు. సాధారణంగా ఒక కిడ్నీ సాధారణంగా 120-150 గ్రాముల బరువు ఉంటుంది. ఆ రోగి కొంత కాలంగా ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే పరిస్థితితో బాధపడుతున్నారు.
మరి కిడ్నీలను పదిలంగా ఉంచుకోవాలంటే ఏంచేయాలి..?

ఈ వ్యాధి ఉన్న రోగుల… అవయవమంతా తిత్తులు పెరుగుతాయి. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి ఒక సాధారణ వంశపారంపర్య వ్యాధి, ఇది రోగులు 30 మరియు 60 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు సమస్యలను సృష్టిస్తుందని వైద్యులు పేర్కొన్నారు. క్రమంగా కిడ్నీలు వైఫల్యం చెంది క్రమంగా క్షీణిస్తుంది. సర్ గంగా రామ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సచిన్ కతురియా మాట్లాడుతూ, ఇన్ఫెక్షన్ మరియు అంతర్గత రక్తస్రావం లక్షణాలు ఉంటే తప్ప వైద్యులు సాధారణంగా అవయవాన్ని తొలగించరని చెప్పారు.

ఆపరేషన్ చేసేటప్పుడు పెద్ద కిడ్నీని వస్తుందని వైద్యులు భావించారని అయితే ఆ కిడ్నీలు అంత ఉంటాయని వాళ్ళు ఊహించలేదని ఆయన డాక్టర్ కతురియా తెలిపారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం అత్యధిక మూత్రపిండాలు 4.5 కిలోలు కాగా ఇవి వాటికన్నా పెద్దగా ఉన్నాయని వైద్యులు పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఒకరికి 9 కేజీల బరువున్న మూత్ర పిండాలను వైద్యులు గుర్తించారని కతూరియ వివరించారు. మూత్రపిండాల యొక్క భారీ పరిమాణం రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తుంది, కాబట్టి దానిని తొలగించడం తప్ప మాకు వేరే మార్గం లేదన్నారు. కాఫీ ఎక్కువగా తాగితే కిడ్నీలకు మంచిదా..? అనే విషయం తెలుసుకుంటే మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news