లవంగాలతో ఇలా చేస్తే సిరి సంపదలు పెరుగుతాయి..

-

మనం వంట గదిలో నిత్యం సుగంద ద్రవ్యాలను చూస్తూ ఉంటాము..ఏదొక వంటలో వాటిని వాడుతుంటారు..రుచితో పాటు మంచి ఆరోగ్యం కూడా..ఒక్కో మసాలా దినుసులో ఒక్కో ఆరోగ్యం దాగి ఉంది. అయితే వీటితో సిరి సంపదలు కూడా పెరుగుతాయని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఎటువంటి వాటిని వాడితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు చుద్దాము..

లవంగాలను ఉపయోగించి మనం ఆర్థిక ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చు. ఎంత కష్టపడినా కూడా ఫలితం కనిపించనప్పుడు, మనం చేసే పనిలో ధన లాభం కలగాలన్నా, ఇంట్లో ధనానికి కొదువ ఉండకూడదు అన్నా.. లవంగాలతో ఈ విధంగా చేయాలి.

ఈ నియమాన్ని పూర్తి నమ్మకంతో, ఎవరికీ తెలియకుండా చేయాలి. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి లవంగాలను ఏవిధంగా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పడు తెలుసుకుందాం. లక్ష్మీ దేవి కటాక్షాన్ని పొందడానికి గాను సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటి బయట, లోపల శుభ్రం చేసి తలస్నానం చేయాలి. తరువాత ఒక ఎర్రని వస్త్రాన్ని, ఒక లవంగాన్ని తీసుకుని లక్ష్మీ దేవికి ఆవు నెయ్యితో దీపారాధన చేసి పూజించాలి. ఇప్పుడు లక్ష్మీ దేవిని మనసులో తలుచుకుంటూ పూర్తి నమ్మకంతో ధనలాభం, సిరిసంపదలు కలగాలని మనసులో కోరుకుంటూ ఆ లవంగాన్ని ఎర్రటి వస్త్రంలో ఉంచి మూటకట్టాలి..

ఆ వస్త్రాన్ని మనం ఇంట్లో ధనం దాచే చోట ఉంచాలి. ఈ విషయాన్ని మరో మనిషితో చెప్పకుండా చేయాలి. అప్పుడే ధన లాభం, సిరి సంపదలు కలుగుతాయి. ఈ విషయాన్ని ఎరితోనైనా చెబితే ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. లవంగాలతో ఈ విధంగా చేయడం వల్ల వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఇంట్లో సిరి సంపదలు, ఐశ్వర్యం వృద్ధి చెంది ఆనందంగా ఉంటారు.ఆరోగ్యం బాగుంటుంది..ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ చికాకులు ఉండవు.. శుక్రవారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news