కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు… మేము టీఆర్ఎస్ ను కన్యాకుమారి మూడు సముద్రాలలో ముంచుతాం.

-

బీజేపీపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. నిన్న బడ్జెట్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్… బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని నేరుగా విమర్శించారు. ప్రధాని మోదీ కేవలం గుజరాత్ కు మాత్రమే ప్రధాని అని… మోదీ ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడి వేషధారణ వేస్తారంటూ… విమర్శించారు.

బీజేపీ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి… బంగాళా ఖాతంలో పడేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని గద్డె దించి దేశంలో పరివర్తణ, గుణాత్మక మార్పులు తీసుకురావాలని వ్యాఖ్యానించారు.అయితే ఈ వ్యాఖ్యలపై సామాజిక న్యాయం & సాధికారత శాఖ సహాయ మంత్రి డాక్టర్ రాందాస్ అథవాలే తీవ్రంగానే స్పందించారు. బీజేపీని బంగాళాఖాతంలో పడేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు మంచివి కావన్నారు. మేము వారిని ( టీఆర్ఎస్)ని కన్యాకుమారి వద్ద మూడు సముద్రాలతో ముంచేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news